బెంగళూరు, జూన్ 1 : ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బ్రజేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 30, 2029 వరకు కొనసాగనున్నదని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన బ్రజేష్ కుమార్.. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ బ్యాంకింగ్, మానవ వనరులు, బిజినెస్ డెవలప్మెంట్, వ్యూహాత్మక వ్యాపార విస్తరణ విభాగాల్లో మంచి పట్టుంది. కెనరా బ్యాంక్లో చేరకముందు ఆయన ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు.
బ్యాంక్ ఎండీ, సీఈవో విధులు నిర్వహించిన కే సత్యనారాయణ డిసెంబర్ 31, 2025 ఉద్యోగ పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఉద్యోగ పదవిలో కొత్త వ్యక్తిని నియమించలేదు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) సూచనల మేరకు బ్యాంక్ బోర్డు సమావేశమై ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.