హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు బహుళ జాతి కంపెనీలు ఇక్కడ ఆఫీస్ స్పేస్ను ఏర్పాటు చేయగా.. తాజాగా జర్మనీకి చెందిన బాష్ సంస్థ ఇక్కడే అతిపెద్ద ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ భవనంలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్పేస్ను తొమ్మిదేండ్లపాటు లీజుకు తీసుకున్నట్లు తెలిసింది.
జర్మనీకి చెందిన ఈ కంపెనీ ఇంజినీరింగ్తోపాటు సాఫ్ట్వేర్ సొల్యుషన్స్ సేవలు అందించడానికి భారీ విస్తీర్ణంతో కూడిన కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. చదరపు అడుగుకు రూ.120 చొప్పున ఏడాదికి రూ.30 కోట్ల అద్దెను చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ కార్యాలయంలో ఒకేసారి 3 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా అత్యాధునిక ప్రమాణాలతో ఆఫీస్ స్పేస్ను తీర్చిదిద్దుతున్నారు. మొబిలిటీ సొల్యుషన్స్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కన్జ్యూమర్ గూడ్స్, ఎనర్జీ, బిల్డింగ్ టెక్నాలజీ సేవలను దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు బాష్ అందించనున్నది.
బాష్తోపాటు మరో మూడు గ్లోబల్ సంస్థలు 2 లక్షల చదరపు అడుగులకు పైగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. వీటిలో సీబీఆర్ఈ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ 1.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకోగా..ష్రోడింజర్ సంస్థ 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. వీటితోపాటు అమెరికాకు చెందిన ఎన్బీ హెల్త్కేర్ టెక్నాలజీస్ కూడా నాలెడ్జ్ సిటీలో భారీ విశాలమైన ప్రాంగణంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.