చెన్నై, నవంబర్ 11: బూమ్ మోటర్స్..తాజాగా విద్యుత్తుతో నడిచే వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ‘బూమ్ కార్బెట్’ పేరుతో విడుదల చేసిన తొలి బైకు ధర రూ.89,999గా నిర్ణయించింది. ఈ బైకుపై ఏడేండ్ల వారెంటీతోపాటు బ్యాటరీకి ఐదేండ్ల గ్యారెంటీ ఇస్తున్నది. పోర్టబుల్ చార్జర్ కలిగిన ఈ బైకు ప్రతి గృహంలో రిచార్జి చేసుకునే వీలుంటుంది. రెండు బ్యాటరీల ఆప్షన్ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. ఈ నెల 12 నుంచి రూ.399 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా బుకింగ్ చేసుకున్నవారికి రూ.3 వేల వరకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నారు. కాలుష్యంతో వాతావరణంలో పెనుమార్పులు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఈవీలతో వాహన పొల్యుషన్ను తగ్గించేందుకు వీలు పడనున్నదని బూమ్ మోటర్స్ సీఈవో అనిరుధ్ రవి నారాయణన్ తెలిపారు.