ముంబై, అక్టోబర్ 21: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) నికర లాభంలో రెండింతల వృద్ధి నమోదైంది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.264 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. నికర వడ్డీ ఆదాయం భారీగా పుంజుకోవడం వల్లనే ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.130 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. అలాగే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో బ్యాంక్ నికర లాభం 104 శాతం ఎగబాకి రూ.472 కోట్లకు చేరుకున్నది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.493 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ ఆదాయం 3.27 శాతానికి చేరుకున్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.81 శాతం నుంచి 5.56 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 3.30 శాతం నుంచి 1.73 శాతానికి దిగొచ్చింది.