న్యూఢిల్లీ, మార్చి 10: బీఎండబ్ల్యూ..తాజాగా అప్డేటెడ్ వెర్షన్ ఎస్యూవీ ‘కౌప్ ఎక్స్4’ను దేశీయ మార్కెట్లకు పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారులో పెట్రోల్ వెర్షన్ రూ.70.50 లక్షలు, డీజిల్ వెర్షన్ రూ.72.50 లక్షలుగా నిర్ణయించింది. అప్డేటెడ్ వెర్షన్గా విడుదల చేసిన ఈ మోడల్ డిజైన్, నూతన ఫీచర్స్ పరంగా పలు మార్పులు చేసింది. చెన్నై ప్లాంట్లోనే తయారైన ఈ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మూడు లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఎక్స్4 మోడల్ కేవలం 5.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. అలాగే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.