న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త బైక్ను పరిచయం చేసింది. ఎఫ్ 900 ఎక్స్ఆర్ అప్డేటెడ్ వెర్షన్ను రూ.12.3 లక్షలకు విక్రయిస్తున్నది. ఈ బైక్ను బుకింగ్ చేసుకున్నవారికి జూన్ నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 895 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైక్ కేవలం 3.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లు.