న్యూఢిల్లీ, అక్టోబర్ 21: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎం స్పోర్ట్ను కార్బన్ ఎడిషన్గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధరను రూ.66.30 లక్షలుగా నిర్ణయించింది. చెన్నై ప్లాంట్లో తయారైన ఈ కారుకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. భారత్లో ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్లో అత్యధికంగా అమ్ముడైన మోడళ్ళలో బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఒకటని, వినియోగదారులు కోరుకుంటున్న విధంగా అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 252 హెచ్పీ శక్తినివ్వనున్నది. అలాగే కేవలం 6.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.