న్యూఢిల్లీ, అక్టోబర్ 30: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాను యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ దిగ్గజం బ్లాక్స్టోన్ సొంతం చేసుకుని, దేశంలో హెల్త్కేర్ సర్వీసుల రంగంలోకి ప్రవేశిస్తున్నది. కేర్ హాస్పిటల్స్లో 72.5 శాతం వాటాను మరో అమెరికా ఫండ్ టీపీజీ రైజ్కు చెందిన ప్లాట్ఫామ్ ఈవ్కేర్ నుంచి 700 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 5,827 కోట్లు) కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్టు బ్లాక్స్టోన్ సోమవారం ప్రకటించింది. బ్లాక్స్టోన్ నిర్వహించే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ద్వారా జరిగే ఈ లావాదేవీ ద్వారా కేర్ హాస్పిటల్స్ విలువ రూ.6,600 కోట్లుగా లెక్కించారు.
మరో ప్రత్యేక లావాదేవీ ద్వారా కేరళకు చెందిన కిమ్స్హెల్త్ (కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో 80 శాతం వాటాను కేర్ హాస్పిటల్స్, టీపీజీలు కలిసి 400 మిలియన్ డాలర్లకు కొంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో 300 మిలియన్ డాలర్లు బ్లాక్స్టోన్, 100 మిలియన్ డాలర్లు టీపీజీలు పెట్టుబడి చేస్తాయి. అంటే పరోక్షంగా కేర్ హాస్పిటల్స్ ద్వారా కిమ్స్హెల్త్లో కూడా బ్లాక్స్టోన్ మెజారిటీ వాటాను తీసుకుంటున్నట్లవుతుంది.
బిలియన్ డాలర్లు.. రెండు హాస్పిటల్స్
కేర్ హాస్పిటల్స్లో వాటాకు 700 మిలియన్ డాలర్లు, కిమ్స్హెల్త్లో వాటాకు 300 మిలియన్ డాలర్లు కలిసి ఈ రెండు హాస్పిటల్స్లో బ్లాక్స్టోన్ ఒక్కసారిగా 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేస్తున్నది. కేర్హాస్పిటల్స్ నెట్వర్క్కు కిమ్స్హెల్త్ తోడై భారత్లోని 11 నగరాల్లో 23 హెల్త్కేర్ సదుపాయాలు, 4,000కుపైగా బెడ్స్ కలిగిన అతిపెద్ద హాస్పిటల్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని బ్లాక్స్టోన్ వివరించింది. ఈ సంయుక్త ప్లాట్ఫామ్లో మైనారిటీ వాటాను టీపీజీకి చెందిన ఈవ్కేర్ హెల్త్ ఫండ్ అట్టిపెట్టుకుంటుంది.
ఇండియా హెల్త్కేర్ రంగంలో కేర్ హాస్పిటల్స్, కిమ్స్ హెల్త్లు విశ్వసనీయమైన బ్రాండ్లని, హై క్లినికల్ కేర్ క్వాలిటీపై దృష్టినిలిపే పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ ప్లాట్ఫామ్ను నిర్మించడమే తమ లక్ష్యమని బ్లాక్స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ మణి తెలిపారు. కేర్ హాస్పిటల్స్కు హైదరాబాద్తో పాటు ఔరంగాబాద్, భువనేశ్వర్, ఇండోర్, నాగపూర్, రాయిపూర్, విశాఖపట్నం నగరాల్లో సదుపాయాలు ఉన్నాయి. కిమ్స్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ కేరళలో అతిపెద్ద ప్రైవేటు హెల్త్కేర్ సంస్థ.