Bit coin | గతేడాది తీవ్ర ఒడిదొడుకులకు గురైన క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్..ఈ ఏడాది సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందా.. మున్ముందు లక్ష డాలర్లు పలుకుతుందా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. గతేడాది చివరిలో ఆల్టైమ్ రికార్డు స్థాయిలో 69 వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ తదుపరి 42 వేల డాలర్లకు పడిపోయింది. మరోవైపు గతేడాది చివర్లో కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూశాక.. ఇన్వెస్టర్లు రిస్క్తో కూడిన క్రిప్టోలు.. ప్రత్యేకించి బిట్ కాయిన్లలో పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అయినా నూతన సంవత్సరంలోకి బిట్ కాయిన్ లాభాలతోనే ఎంటరైంది.
క్రిప్టో కరెన్సీల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బిట్ కాయిన్.. గతేడాది 40 శాతం నష్టపోయింది. కానీ.. న్యూఆల్టైమ్ రికార్డు సాధించాక బిట్ కాయిన్ కరెన్సీ ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉందని గ్లోబల్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ముద్రెక్స్ కో ఫౌండర్, సీఈవో ఎడుల్ పటేల్ చెప్పారు. ఈ ఏడాది బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్ల స్థాయికి చేరుకుంటుందన్నారు. స్పెక్యులేటివ్ అసెట్ స్థాయి నుంచి పరివర్తన చెందుతుందని చెప్పారు.
ఒకవేళ బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్ల మైలురాయిని చేరుకుంటే మాత్రం.. దాని ధరపై దాని సామూహిక అడాప్షన్ ప్రభావం ఉంటుందన్నారు ఎడుల్ పటేల్. దాని వాడకానికి లిమిటెడ్ నెట్వర్క్ ఉంటుందని, బిట్ కాయిన్ బ్లాక్చైన్లో రివల్యూషనరీ మార్పులు వస్తాయన్నారు. ఇన్వెస్టర్లు ఎథీరియం అడాప్షన్ చేసుకునే వరకు వెళతారంటున్నారు నిపుణులు.
అయితే, భారత్లో క్రిప్టో కరెన్సీ ధరలు.. ఆయా కరెన్సీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చట్టాలు.. ప్రభుత్వ ప్రణాళికలు ఖరారు చేస్తాయి. బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలు మోసపూరిత ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని నరేంద్మరోదీ చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బిట్ కాయిన్ను అధికారిక కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాలను సంప్రదించాకే క్రిప్టోబిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఇటీవల అన్నారు.