లండన్: దాదాపు రెండు నెలల తర్వాత క్రిప్టో కరెన్సీ మేజర్లు బిట్ కాయిన్, ఏథెర్ పుంజుకున్నాయి. అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లో క్రిప్టో రూల్స్పై అనిశ్చితి వెంటాడుతున్నా, లండన్ మార్కెట్లో ఏథేరియం అప్గ్రేడ్ అయ్యాక బిట్ కాయిన్, ఏథెర్ తాజా హై రికార్డులకు చేరుకున్నాయి.
శనివారం ట్రేడింగ్లో బిట్ కాయిన్ 4.1 శాతం పుంజుకుని 44,463 డాలర్లకు చేరుకున్నది. గత మే 18 తర్వాత బిట్ కాయిన్ విలువ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. లండన్ మార్కెట్లో ఎథేరియం నెట్వర్క్ అప్గ్రేడ్ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు ఏథెర్ 6.9 శాతం పెరిగి, 3,145 డాలర్ల వద్ద స్థిర పడింది.