హైదరాబాద్, ఏప్రిల్ 5:ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్, ఏసీలు కొనుగోలుపై ఆకర్షణీయమైన వినూత్న ఆఫర్లు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైల్స్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, ఏసీల కొనుగోలుపై 7.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్, ఏడాదిపాటు మొబైల్ ప్రొటెక్షన్, రెండో ఏడాది రూ.8 వేల వరకు విలువకలిగిన మొబైల్ ప్రొటెక్షన్ను అదనంగా పొందవచ్చునని తెలిపారు.
ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతితోపాటు వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోలు చేసే అవకాశం కూడా సంస్థ కల్పించింది. వీటితోపాటు బ్రాండెడ్ యాక్సససీరిస్పై 51 శాతం డిస్కౌంట్, ఐఫోన్లపై రూ.39 వేల వరకు ప్రయోజనాలు, సామ్సంగ్ మొబైళ్లపై రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్, వివో మొబైళ్లపై రూ.7 వేల వరకు, ఒప్పో మొబైళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, రియల్మీ మొబైళ్లపై రూ.3 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్, 32 అంగుళాల టీవీని రూ.9,999కే అందిస్తున్నది.