హైదరాబాద్, డిసెంబర్ 23: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ దిగ్గజం బిగ్”సి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన తొలి లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో మారుతి ఆల్టో కారు గెలుచుకున్నవారు ఆరుగురు కస్టమర్లు. వీరిలో సీ గోపాల కృష్ణ(కూ.నం: 38011), రితేష్ కుమార్ జా(కూ.నం: 15861), ఎం రాజు(కూ.నం: 36176), పర్వేజ్ అహ్మద్(కూ.నం: 8586), లికితా(కూ.నం: 36421), జీ అకిల్(కూ.25735) ఉన్నారు.
ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని, తొలి లక్కీ డ్రా విజేతలను డ్రా తీసి ప్రకటించినట్లు చెప్పారు. మారుతి ఆల్టో కారుతో పాటు బజాజ్ ప్లాటినా బైకు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలను ఆరుగురు చొప్పున గెలుచుకున్నారు. ఈ ఆఫర్లలో భాగంగా 20 కార్లు, 20 బజాజ్ ప్లాటినా బైకులు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతిగా అందిస్తున్న విషయం తెలిసిందే.