న్యూఢిల్లీ, జూలై 30: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.448.20 కోట్ల నష్టం వచ్చింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.893.14 కోట్లతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,086.43 కోట్ల నుంచి రూ.2,966.77 కోట్లకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్తో గత త్రైమాసికం మొదట్లో తీవ్ర ప్రభావం చూపినప్పటికీ చివరికి కోలుకున్నట్లు వెల్లడించింది.