హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కీలక ఖనిజాల(క్రిటికల్ మైనింగ్) అన్వేషణలో సింగరేణి రాణించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేలంలో పాల్గొనాలని సూచించారు. బుధవారం ఫూలే ప్రజాభవన్లో సింగరేణి సంస్థ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వెనాడియం, టైటానియం బ్లాక్ల వేలంలో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌతాఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చీలి వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని చెప్పారు. సమావేశంలో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావులు పాల్గొన్నారు.