Airtel | న్యూఢిల్లీ, మార్చి 17: తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్టెల్ ఓ సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. 4జీలో 5జీ అపరిమిత డాటాను ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 4జీ ప్లాన్లలోని 5జీ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. రూ.239 నుంచి ఈ ప్లాన్ల ధర మొదలవుతుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్టెల్ ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో.. నెట్వర్క్ విస్తరణ కింద ట్రయల్స్లో భాగంగా తమ కస్టమర్లకు 5జీ అన్లిమిటెడ్ డాటాను అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజా ఆఫర్ ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, డాటా పరిమితి గురించి బెంగ లేకుండా ఈ ఆఫర్తో తమ కస్టమర్లు ప్రపంచ శ్రేణి ఎయిర్టెల్ 5జీ ప్లస్ను ఆనందించవచ్చని ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ కన్జ్యూమర్ బిజినెస్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270కిపైగా నగరాల్లో ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4జీ కంటే 5జీ ప్లస్ వేగం 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్టెల్ చెప్తున్నది.