న్యూఢిల్లీ, ఆగస్టు 4: విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను కూడా రూ.343.89 కోట్ల నష్టం వచ్చినట్లు వెల్లడించింది.
నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. జూన్ 30, 2022లోనూ సంస్థకు రూ.187.99 కోట్ల నష్టం వచ్చింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.4,742.28 కోట్ల నుంచి రూ.5,117.20 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు రూ.5,006 కోట్ల నుంచి రూ.5,595 కోట్లకు చేరుకున్నాయి.