న్యూఢిల్లీ : భారత్లో బెనెల్లి టీఆర్కే 251 అడ్వంచర్ బైక్ను బెనెల్లి ఇండియా లాంఛ్ చేసింది. ఈ బైక్ ధర రూ 2.52 లక్ష (ఎక్స్షోరూం, ఇండియా)లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. జనవరి 2022 నుంచి డెలివరీలు ప్రారంభం కానుండగా రూ 6000 టోకెన్ అమౌంట్తో ప్రీ బుకింగ్స్ను కంపెనీ ప్రారంభించింది.
బెనెల్లి టీఆర్కే రేంజ్ను పోలిన డిజైన్తో టీఆర్కే 251 ఫీచర్లను పొందుపరిచినా బైక్ను చిన్నపాటి మార్పులు, తాజా జోడింపులతో వాహనాన్ని రీస్టైల్ చేసింది. బెనెల్లి టీఆర్కే 251 బైక్ గ్లాసీ వైట్, గ్లాసీ బ్లాక్, గ్లాసీ గ్రేల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. బెనెల్లి టీఆర్కే 251 మూడేండ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ వ్యారంటీని కలిగిఉంటుందని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జభక్ తెలిపారు.
భారత్లో యంగ్ అడ్వంచర్ మెషీన్ను లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అడ్వంచర్ బైకింగ్ను ఇష్టపడే వారికి టీఆర్కే 251 వినూత్న అనుభూతి ఇస్తుందని అన్నారు. బెనెల్లి టీఆర్కే 251 న్యూ జనరేషన్ బీఎస్6 249సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్తో పాటు 18 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 170ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగిఉంది.