హైదరాబాద్, మే 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,381 కోట్ల ఆదాయంపై రూ.264 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,137 కోట్ల ఆదాయంపై రూ.260 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2,817 కోట్ల ఆదాయంపై రూ.500 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.10,170 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. వచ్చే రెండు నుంచి మూడేండ్ల వరకు ఈ ఆర్డర్లు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది.