IAMAI On Crypto Ban | క్రిప్టో కరెన్సీలపై పూర్తి నిషేధం విధించడం వల్ల డిజిటల్ కరెన్సీతో చట్టవిరుద్ధ కార్యక్రమాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. క్రిప్టోలపై పూర్తి నిషేధం రాజ్యేతర శక్తులు వాటిని మరింత చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వినియోగించే ముప్పు పొంచి ఉందని ఐఎఎంఏఐ అనుబంధ ఇండస్ట్రీ బాడీ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కౌన్సిల్ (బీఏసీసీ) గురువారం ఓ ప్రకటనలో పేర్కొందిది. ఐఎఎంఏఐ అంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్. క్రిప్టో కరెన్సీలను కేవలం ఆస్తిగానే ఉపయోగించుకునేందుకు అనుమతించాలని సూచించింది.
క్రిప్టో కరెన్సీల లావాదేవీలు, కార్యకలాపాలపై ప్రజాతంత్ర దేశాలన్నీ కలిసి పని చేయడం చాలా ముఖ్యం అని, యువత జీవితంతో ఆడుకునే చీకటి శక్తుల (తప్పుడు వ్యక్తుల) చేతుల్లోకి వెళ్లకుండా నివారించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన ప్రకటనలో ఏకీభవిస్తున్నట్లు ఐఎఎంఏఐ పేర్కొంది. క్రిప్టోలపై పూర్తి నిషేధం విధించడంతో పలు ప్రతికూల పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది.
పూర్తి నిషేధం వల్ల క్రిప్టోల వాడకానికి చరమగీతం పాడటం, వాటిని వినియోగిస్తున్న మూలాలను నిర్ధారించడం కష్టం అవుతుందని వ్యాఖ్యానించింది. బ్యాన్ విధించడంతో అకౌంటబిలిటీ వహించేవారు ఉండరని, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడే ముప్పు పొంచి ఉందని ఏఐఎంఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. భారత్ కరెన్సీకి ఆల్టర్నేటివ్గా వాడితే దేవ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య నియంత్రణల్లో క్రిప్టో కరెన్సీల జోక్యం పెరుగుతుందని బీఏసీసీ వివరించింది. కనుక భారతీయులు కరెన్సీగా క్రిప్టోలను వాడకుండా చట్టపరంగా ఆంక్షలు విధించడానికి అనుకూలమని తెలిపింది.
క్రిప్టో ఆస్తులపై స్మార్ట్లీ రెగ్యులేషన్ అమలు చేయడం వల్ల ఇన్వెస్టర్లకు రక్షణ లభిస్తుందని ఐఏఎంఐఏ అనుబంధ బీఏసీసీ పేర్కొంది. తద్వారా భారత్లో క్రిప్టోల కొనుగోలుదారులు, విక్రేతల నియంత్రణకు వీలవుతుందన్నది. తద్వారా క్రిప్టో ఇండస్ట్రీపై మెరుగైన పన్నులు విధించడానికి, చట్ట విరుద్ధ క్రిప్టోల వినియోగానికి చెక్ పెట్టినట్లవుతుందని వివరించింది. ఇటీవల కర్ణాటకలో బిట్కాయిన్ స్కాం వెలుగు చూడటంతో క్రిప్టోల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ను వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.