ముంబై, జనవరి 12: ఈ నెలాఖర్లో వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనున్నది. 30, 31 తేదీల్లో సమ్మెకు దిగాలని గురువారం బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. వివిధ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇక్కడ జరిగిన బ్యాంక్ ఉద్యోగుల ఐక్య మండలి (యూఎఫ్బీయూ) సమావేశంలో తీర్మానించినట్టు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కాగా, వారానికి ఐదు పని దినాలు, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లను ఉద్యోగులు చేస్తున్నారు.