King Charles III | ఇంగ్లండ్.. గ్రేట్ బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకున్నా, రాజరిక సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కొన్ని పద్దతులు అలాగే ఉన్నాయి. ఇటీవలే మహారాణి ఎలిజబెత్-2 మరణించారు. ఆమె వారసుడిగా చార్లెస్-3 బ్రిటన్ మహరాజుగా బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు ఇంగ్లండ్ కరెన్సీ నోట్ల (పౌండ్ల)పై ఎలిజబెత్ -2 మహారాణి ముఖ చిత్రం ప్రచురించేవారు. ఆమె మరణంతో ఇక కింగ్ చార్లెస్ ముఖచిత్రం ప్రచురిస్తారు. చార్లెస్ ముఖ చిత్రంతో ముద్రించిన తొలి బ్యాంక్ నోటును బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఆవిష్కరించింది.
2024 మధ్య వరకు చార్లెస్ ముఖచిత్రంతో ముద్రించిన బ్యాంకు నోట్లన్నీ చలామణిలోకి వస్తాయని భావిస్తున్నారు. 1960 నుంచి ఎలిజబెత్-2 మహారాణి ముఖచిత్రంతో ముద్రిస్తున్న నోట్ల స్థానంలో చార్లెస్ ముఖ చిత్రంతో ప్రచురించిన నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ దశల వారీగా చలామణిలోకి తీసుకురానున్నది. 470 కోట్ల బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఎస్సెక్స్లోని అత్యంత భద్రత గల డెబ్డెన్ ప్రింటింగ్ వర్క్స్ భవనంలో 1956 నుంచి ఈ నోట్ల ముద్రణ జరుగుతున్నది.
యునైటెడ్ కింగ్డమ్ పౌండ్ కాయిన్లను రాయల్ మింట్ వెలువరిస్తుంది. ఇప్పటికే చార్లెస్ చిత్రంతో కూడిన కరెన్సీని ఆవిష్కరించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2700 కోట్ల (ఎలిజబెత్-2 ముఖచిత్రంతో గల) కాయిన్లను దశల వారీగా మార్చేస్తారు. నోటుకు మరోవైపు మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, ఆథర్ జాన్ అస్టిన్, పెయింటర్ జేఎండబ్ల్యూ టర్నర్, గణిత శాస్త్రవేత్త అలన్ టురింగ్ ముఖచిత్రాల ప్రచురణ కొనసాగుతుంది.