చెన్నై, అక్టోబర్ 25: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో వచ్చే నెల 19న జరగనున్న ఈ సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం కలగనున్నది. యూనియన్లో చురుకుగా ఉన్నందుకు గాను బ్యాంకర్లను బలిపశువును లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.
ఇటీవల కాలంలో బ్యాంక్ ఉద్యోగులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని, వీటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలకాలంలో సోనాలీ బ్యాంక్, ఎఫ్యూఎఫ్ఈజీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉద్యోగులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. వీటితోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్లు పలు అవుట్సోర్సింగ్ కార్యకలాపాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.