పుణె, మార్చి 16: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనమైన పల్సర్లో సరికొత్త మాడల్ను పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్ సిరీస్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కలర్స్, నూతన అవతార్గా తీర్చిదిద్దింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ బైకులో పల్సర్ ఎన్ఎస్200 మాడల్ ధర రూ.1,47,347, పల్సర్ ఎన్ఎస్ 160 మాడ ల్ రూ.1,34,675గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.