ముంబై, ఫిబ్రవరి 6: హైదరాబాద్ కేంద్రంగా ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.16.8 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3.83 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 49 శాతం ఎగబాకి రూ.89.23 కోట్లకు చేరుకున్నది. దీంట్లో ఎనర్జీ సెగ్మెంట్ నుంచి 81 శాతం నుంచి సమకూరగా, డిఫెన్స్ నుంచి 17 శాతం లభించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో స్టాక్ మార్కెట్లో లిైస్టెన విషయం తెలిసిందే.