న్యూఢిల్లీ, మార్చి 25: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు అవలాన్ టెక్నాలజీ.. ఐపీవోకి వస్తున్నది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.865 కోట్ల నిధులను సమీకరించనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 31న షేర్లను విక్రయిస్తున్నది. ఈ ఐపీవోలో రూ.320 కోట్లను తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించనున్న సంస్థ..మరో రూ.545 కోట్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా సేకరించాలనుకుంటున్నది.