న్యూఢిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా వాహన టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. రిటైల్ విక్రయాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో 2023లో 11 శాతం అధికమయ్యాయని డీలర్ల సంఘం ఫాడా తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 2,38,67,990 యూనిట్లు అమ్ముడుకాగా, అంతక్రితం ఏడాది 2,14,92,324 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో ప్యాసింజర్ వాహనాలు 38,60,268 యూనిట్లు. 2022లో అమ్ముడైన 34,89,953 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల కంటే ఇది 11 శాతం అధికమని పేర్కొంది. ద్విచక్ర వాహన విక్రయాలు 1,55,88,352 యూనిట్ల నుంచి 1,70,61,112 యూనిట్లకు చేరాయి. అలాగే త్రి చక్ర వాహన రిటైల్ సేల్స్ 58 శాతం అధికమై 6,81,812 యూనిట్ల నుంచి 10,80,653 యూనిట్లకు చేరగా..కమర్షియల్ వాహన సేల్స్ 8 శాతం పెరిగి 9,94,330 యూనిట్లకు చేరుకున్నాయి.