హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాదీ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా తన వ్యాక్సిన్ వ్యాపారాన్ని ఒక ప్రత్యేక యూనిట్కు బదిలీ చేయనుంది. తమ సబ్సిడరీ అయిన అరో వ్యాక్సిన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేస్తున్నట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ లావాదేవీకి మాతృసంస్థకు సబ్సిడరీ రూ.299 కోట్లు చెల్లిస్తుంది. 2022 జనవరి 1 నుంచి బదిలీ అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ వ్యాపారం అరో వ్యాక్సిన్స్కు విక్రయించే ప్రక్రియ 2021-22 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది. అలాగే మరో పూర్తిస్థాయి సబ్సిడరీ అయిన టెర్జీన్ బయోటెక్ను కూడా రూ.10.76 కోట్లకు బదిలీ చేస్తున్నట్లు అరబిందో ఫార్మా తెలిపింది.