హైదరాబాద్, నవంబర్ 29: అరబిందో ఫార్మాకు చెందిన హెచ్ఐవీ జనరిక్ ఔషధానికి యూఎస్ నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దరునవీర్ ట్యాబ్లెట్ను అక్కడ తయారు చేయడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి అనుమతినిచ్చినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ట్యాబ్లెట్ 600 ఎంజీ, 800 ఎంజీల్లో లభించనున్నది.