ముంబై, మార్చి 18 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ మాడల్ను తీసుకొచ్చింది. ఎస్యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో నయా క్యూ8 మాడల్ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.1,77,72,000. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. శక్తివంతమైన 4.0 లీటర్ వీ8 టీఎఫ్ఎస్ఐ ఇంజిన్తో తయారైన ఈ కారు కేవలం 4.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్స్, పానోరమిక్ సన్రూఫ్, స్పోర్ట్ సీట్స్, వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్స్తో తయారు చేసింది. ఈ కారుపై పదేండ్ల రోడ్సైడ్ అసిస్టెన్స్ వ్యారెంటీని కల్పిస్తున్నది.