న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆడీ మరోసారి తన వాహన ధరలు పెంచబోతున్నది. వచ్చే నెల నుంచి అమలలోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ళ ధరలను 2.4 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, రవాణా కోసం పెట్టే ఖర్చులు అధికమవడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని,
ఈ నూతన ధరలు వచ్చే నెల 20 నుంచి అమలులోకి రానున్నట్లు ఆడీ ఇండియా హెచ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోర్ట్బ్యాక్, ఆర్ఎస్ 5 స్పోర్ట్బ్యాక్, ఆర్ఎస్క్యూ8 మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.