ఫిక్స్డ్ డిపాజిటుదారులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతునే…మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీని అర శాతం వరకు పెంచగా..తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు చేరాయి. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ పెంపు వర్తించనున్నది.