ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయింది. మహారాజా గురువారం అధికారికంగా టాటా సన్స్ కాక్పిట్లోకి చేరిపోయింది. టాటా సన్స్ చేతికి ఎయిరిండియా యాజమాన్య బాధ్యతలు అప్పగించినట్లు కేంద్రం ప్రకటించింది. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీతో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు.
‘టాటా సన్స్ గ్రూప్ చెంతకు తిరిగి ఎయిరిండియా రావడం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. అందరితో కలిసి పని చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానయాన సంస్థగా ఎయిరిండియాను రూపుదిద్దేందుకు ముందుకు సాగుతాం’ అని ఎయిరిండియా అప్పగింత తర్వాత టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. దాదాపు 69 ఏండ్ల తర్వాత అంటే ఏడు దశాబ్దాలకు ఎయిరిండియా.. మహారాజా.. బాంబే హౌస్ ఆధీనంలోకి వెళ్లింది. రెండు దశాబ్దాలుగా ఎయిరిండియా ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాల టైం లైన్ ఇలా..