న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర రూ.440 ఎగబాకి రూ.50,400 పలికింది. కిలో వెండి రూ.560 అధికమై రూ.58,580కి చేరుకున్నది. అటు హైదరాబాద్లోనూ బంగారం మరింత ప్రియమైంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.240 పెరిగి మళ్లీ రూ.50 వేలు దాటి రూ.50,200కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.46 వేలు పలికింది. కిలో వెండి రూ.800 ఎగబాకి రూ.63 వేలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,677 డాలర్లకు, వెండి 19.69 డాలర్ల వద్ద ఉన్నాయి.