ముంబై, డిసెంబర్ 2: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో పైలట్లు మళ్లీ ఆందోళనబాట పట్టబోతున్నారా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ స్కీంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తంచేసిన పైలట్లు తాజాగా..దీనిని తీవ్రంగా ఆందోళణ వ్యక్తంచేశారు. ఈ మార్గదర్శకాలను డీజీసీఏ ఆమోదం తెలపడంతో ఇండియన్ పైలట్స్ గిల్డ్(ఐపీజీ), ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్(ఐసీపీఏ) సంయుక్తంగా వ్యతిరేకించాయి.
ఈ విషయాన్ని ఒక ప్రకటనలో శనివారం విడుదల చేశాయి కూడా. డీజీసీఏ జారీ చేసిన అసెస్మెంట్పై సమీక్షించాలని పైలెట్ల యూనియన్ కోరుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో నాగపూర్ విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్ పడిపోయి పైలెట్ మృతి చెందిన సంఘటనపై ఎయిర్ ఇండియా పైలెట్లు ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే గత నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో పైలట్ల శిక్షణలో అసౌకర్యంగా ఉండటం, ఆ తర్వాత ఆయన మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకున్నది.