Reliance & Aram Co | రిలయన్స్, సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ సంస్థ సౌదీ ఆరాం కో మధ్య ఒప్పందం కటీఫ్ అయ్యింది. అయినప్పటికీ భారత్లో నూతన పెట్టుబడి అవకాశాలను తాము పరిశీలిస్తామని సౌదీ ఆరామ్ కో పేర్కొంది. దీర్ఘకాలంలో భారత్లో అద్భుతమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్తో తమకు దీర్ఘ కాలిక భాగస్వామ్యం ఉందని, భారత్లో పెట్టుబడి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆరామ్ కో వివరించింది. కారణాలేవీ చెప్పకుండా గత శుక్రవారం తమ రెండు సంస్థలు డీల్ నుంచి వైదొలిగాయని రిలయన్స్ ప్రకటించింది. ఈ ఏడాది జూన్లో ఆరామ్కోతో పెట్టుబడి ఒప్పందం ఖరారవుతుందని ప్రకటించిన రిలయన్స్, ఆరామ్ కో చైర్మన్ యాసిర్ అల్ రుమాయన్ను తమ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించింది. అయినా, ఇప్పటికి ఆరామ్కోతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని, భారత్లో ఆరామ్కో ను ప్రాధాన్య భాగస్వామిగా భావిస్తున్నామని రిలయన్స్ వ్యాఖ్యానించింది. 2019 ఆగస్టులో రిలయన్స్లో 20 శాతం వాటా (15 బిలియన్ల డాలర్ల) వాటా కొనుగోలుకు నాన్ బైండింగ్ లెటర్ఆఫ్ ఇండెంట్పై ఆరామ్ కో సంతకాలు చేశాయి.