న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఇండియా అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.49,322 కోట్ల ఆదాయాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే వచ్చిన రూ.33,381 కోట్ల ఆదాయంతో పోలిస్తే 48 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఐఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. అలాగే కంపెనీ ఆదాయం రూ.1,263 కోట్ల నుంచి రూ.2,230 కోట్లకు ఎగబాకింది. ఖర్చులు రూ. 46,444 కోట్లుగా నమోదయ్యాయి.