న్యూఢిల్లీ, జూన్ 24: హెల్త్కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ తన ఫార్మాసీ, డిజిటల్ వ్యాపారాల్ని విలీనం చేస్తూ ఒక కొత్త కంపెనీని ఏర్పాటుచేయనున్నది. అపోలో హెల్త్కేర్ కో పేరుతో నెలకొల్పుతున్న ఈ కంపెనీలోకి ఫార్మసీ రిటైల్, డయాగ్నస్టిక్ వ్యాపారాల్ని, ఆన్లైన్ బ్రాండ్లను బదిలీ చేస్తామని, కొత్త కంపెనీ 100 శాతం సబ్సిడరీగా వుంటుందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ గురువారం ప్రకటించింది.
తగ్గిన లాభం
2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ నికరలాభం 23.5 శాతం క్షీణించి రూ.168 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ.219 కోట్లు. ఆదాయం సైతం స్వల్ప తగ్గుదలతో రూ.2,922 కోట్ల నుంచి రూ.2,868 కోట్లుగా నమోదైంది.