హైదరాబాద్, ఆగస్టు 8: దేశంలో వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న బిల్డింగ్ పరికరాల తయారీ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజేస్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు వ్యాపార విస్తరణకోసం, ప్లాంట్ల సామర్థ్యాన్నిపెంచడానికి రూ.150 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల్లో హైదరాబాద్లోని రుద్రారం వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో యూపీవీసీ యూనిట్ను, మరో రూ.50 కోట్లతో టైల్స్, రెడీ-మిక్స్ కాంక్రిట్, అల్యూమినియం నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ ఎండీ అశ్విన్ రెడ్డి తెలిపారు. దీంతో యూపీవీసీ కెపాసిటీ 700 టన్నుల నుంచి 1,200 టన్నులకు, కిటికీలు 20 వేల చదరపుల నుంచి 50 వేల చదరపులకు చేరుకోనున్నదన్నారు.