న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సింగపూర్కు చెందిన సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ తన ఇండియా యూనిట్ను విక్రయిస్తున్నది. తమ డీకార్బనైజేషన్ ప్రణాళికలో భాగంగా సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా (ఎస్ఈఐఎల్)లో నూరు శాతం వాటాల్ని ఒమాన్ ఫండ్స్ కన్సార్షియం తన్వీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీటీఈకి రూ. 11,700 కోట్లకు విక్రయించనున్నట్టు సెంబ్కార్ప్ తెలిపింది.
ఎస్ఈఐఎల్కు 4.3 గిగావాట్ల థర్మల్, రెన్యువబుల్ ఎనర్జీ ఆస్తులు, దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో 1.7 గిగావాట్ల విడ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 2,640 మెగావాట్ల (2.6 గిగావాట్లు) థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రధానమైనది. గల్ఫ్ దేశమైన ఒమాన్ రక్షణశాఖ పెన్షన్ ఫండ్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఒమాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఓఐసీ) నేతృత్వంలోని కన్సార్షియంకు చెందిందే ఈ తన్వీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఒమాన్ డిఫెన్స్ పెన్షన్ ఫండ్ విద్యుత్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడి చేస్తుండగా, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయిన ఓఐసీ..విద్యుత్, ఇన్ఫ్రా ప్రాజెక్టులతో పాటు రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, హెల్త్కేర్ రంగాల్లో పెట్టుబడులు చేస్తున్నది. అసెట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసుల్ని నిర్వహిస్తున్నది.