హైదరాబాద్, మార్చి 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ స్మార్ట్న్.్ర.తాజాగా మార్కెట్లోకి రెండో ఎలక్ట్రిక్ బైకును పరిచయం చేసింది. టీబైక్ వనెక్స్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.38 వేలు. జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ, ప్రాంతీయ ఎకోసిస్టమ్ను దృష్టిలో పెట్టుకొని దేశీయ ఇంజినీర్లు తయారు చేసినట్లు వెల్లడించారు. మల్టీ-పర్సస్, మల్టీ-యుటిలిటీ వాహనమైన ఈ బైకుతో రూపాయి కంటే తక్కువ ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణించవచ్చునని తెలిపింది. పంక్చర్ ప్రూఫ్ టైర్ కలిగిన ఈ బైకుపై లైఫ్టైం వ్యారెంటీని ఇస్తున్నది సంస్థ. దేశీయ వ్యాపారంతోపాటు అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఆఫ్రికా, బ్రిటన్/ఐర్లాండ్, భూటాన్, మెక్సికో దేశాలకు విస్తరించేయోచనలో ఉన్నట్లు కంపెనీ ఫౌండర్, చైర్మన్ మహేశ్ లింగారెడ్డి తెలిపారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైకు బ్యాటరీ రీచార్జితో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది.