న్యూఢిల్లీ, ఆగస్టు 28: హైదరాబాద్లో మరో డాటా సెంటర్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్ నోట్-సెక్యూరిటీ పేపర్ మాన్యుఫ్యాక్చరర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)తో టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ కార్పొరేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐపీఎల్) రూ.137 కోట్ల ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్తోపాటు నోయిడాలో డాటా సెంటర్లు రాబోతున్నట్టు సోమవారం సీఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఒకటి ‘ప్రైమరీ అండ్ డిజాస్టర్ రికవరీ’ సెంటర్ కూడా ఉన్నట్టు చెప్పింది. కాగా, ఈ ప్రాజెక్టుతో ఎస్పీఎంసీఐఎల్.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందని సీఐపీఎల్ వివరించింది.