న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ రుణ వితరణలో 21.67 శాతం వృద్ధిని కనబరిచింది. గడిచిన పది త్రైమాసికాలుగా రుణ వితరణలో తొలిస్థానంలో నిలిచిన బ్యాంక్..గత త్రైమాసికంలోనూ తన స్థానాన్ని పదిలపరుచుకున్నది. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19.80 శాతం వృద్ధిని సాధించింది. అలాగే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 16.91 శాతం వృద్ధిని సాధించి మూడో స్థానంలో నిలిచింది.