న్యూఢిల్లీ, మే 2: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.87 శాతం తగ్గి రూ.763 కోట్లకు పడిపోయింది. ఏడాది క్రితం ఇది రూ.856.46 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.7,965.98 కోట్లుగా నమోదైంది. నిర్వహణ ఖర్చులు రూ.6,813.51 కోట్ల నుంచి రూ.7,118.71 కోట్లకు పెరిగాయి. గత త్రైమాసికంలో కంపెనీ సిమెంట్ విక్రయాలు 2.66 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.