న్యూఢిల్లీ : ప్రైమ్ మెంబర్స్ కోసం పాపులర్ సేల్ ప్రైమ్ డే సేల్తో అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లతో మరోసారి ముందుకొస్తోంది. జులై 23 నుంచి 24 వరకూ సేల్ ఆఫర్ అమలు కానుండగా స్మార్ట్పోన్లు, టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్, ల్యాప్టాప్లు వంటి పలు గ్యాడ్జెట్లు, ఉత్పత్తులపై కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ ఈ రీడర్స్పై ఆకర్షణీయ ఆఫర్లతో పాటు 55 శాతం డిస్కౌంట్ లభించనుంది. వాయిస్ కమాండ్స్తో ఇష్టమైన మ్యూజిక్ ప్లే కావడంతో పాటు అమెజాన్ ఇకో స్పీకర్ల ద్వారా స్మార్ట్ లైట్స్, టీవీలను ఈ స్పీకర్లు మేనేజ్ చేయవచ్చు.
ప్రైమ్ డే సేల్లో భాగంగా ఫైర్ టీవీ స్టిక్పై 60 శాతం ఆఫర్తో పాటు జీ5, సోనీ లివ్, వూట్ సెలెక్ట్ సబ్స్క్రిప్షన్స్ను పరిమిత వ్యవధికి గాను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ డే సేల్స్లో ఆల్ న్యూ కిండల్ పేపర్వైట్, కిండల్ పేపర్వైట్ సిగ్నేచర్ను వరుసగా రూ 11,099, రూ 15,299కి అందుబాటులో ఉంది.