న్యూఢిల్లీ, జూలై 6: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి ప్రత్యేక విక్రయ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి 24 వరకు రెండు రోజుల పాటు ‘ప్రైమ్ డే’ సేల్స్ పేరుతో ప్రత్యేక ప్రొగ్రాంను నిర్వహిస్తున్నది. అలాగే మెంబర్ షిప్ ఫీజును మాత్రం 50 శాతం పెంచింది. నూతనంగా సభ్యత్వం తీసుకునేవారు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.999గా ఉండేది. నెలవారి ప్రైమ్ మెంబర్షిప్ చార్జీని కూడా రూ.129 నుంచి రూ.179కి పెంచింది. ఈ ప్రైమ్ డే సందర్భంగా 30 వేల నూతన ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.