హైదరాబాద్, ఆగస్టు 25: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అమెజాన్ పే స్మార్ట్ స్టోర్ సేవలను ప్రారంభించింది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మంలలో ఉన్న 800కిపైగా ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో విక్రయిస్తున్న ఉత్పత్తులపై రాయితీలు, ఇతర ప్రయోజనాల గురించి కస్టమర్లకు సమాచారం ఇది అందిస్తుంది.
సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 4ను కొనుగోలు చేసిన కస్టమర్కు మొబైల్ను అందిస్తున్న మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ ఎండీ సమీర్. ఈ ఫోన్ ధర రూ.89,999 నుంచి రూ.1,84,999 మధ్యలో ఉన్నది.