న్యూఢిల్లీ : ప్రైమ్ డే సేల్ అనంతరం అమెజాన్ తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్కు తెరలేపింది. ఆగస్ట్ 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్పై 40 శాతం వరకూ డిస్కౌంట్ను ఈ కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఎస్బీఐ కార్డులపై పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను కూడా ఆఫర్ చేస్తోంది.
ఇది కాకుండా ఎంపిక చేసిన ఉత్పత్తులపై రెగ్యులర్ డిస్కౌంట్స్, ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని వారు ఫ్రీడం ఫెస్టివల్ సేల్లో తక్కువ ధరకే తాము కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రక్షా బంధన్ కూడా రానుండటంతో ఈ సీజన్లో అమెజాన్ సేల్ మెరుగైన అవకాశంగా ముందుకొస్తోంది.
ఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్పై అమెజాన్ సేల్లో నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లపైనా అమెజాన్ మెరుగైన డీల్స్, ఆఫర్లను అందిస్తోంది. హెడ్ఫోన్లపై 75 శాతం వరకూ, ల్యాప్టాప్లపై 40 శాతం, ట్యాబ్లెట్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.