హైదరాబాద్, మే 23: అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.2,429.21 కోట్ల ఆదాయంపై రూ.191.52 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,180.70 కోట్ల ఆదాయంతో పోలిస్తే 10 శాతం పెరుగగా, రూ.132.49 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇంచుమించుగా 50 శాతం వరకు పెరిగింది.
మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3.20 లేదా 320 శాతం డివిడెండ్ను సంస్థ పంచింది.