Maruti Ertiga | మారుతి సుజుకి అన్ని రకాల ఎర్టిగా మోడల్ కార్ల ధరలు పెంచేసింది. అంతే కాదు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ)తోపాటు హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఇంతకుముందు ఎర్టిగా కేవలం ఆటోమేటిక్, టాప్ ఎండ్ మాన్యువల్ ట్రిమ్ ఆప్షన్లలోనే లభించింది. మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) మోడల్ అన్ని రకాల వేరియంట్ల ధరలు రూ.6000 పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
అన్ని రకాల ఎర్టిగా మోడల్ కార్లు ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్ ప్రమాణాలతో కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా.. బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుతం అన్ని రకాల వేరియంట్ కార్ల ధరలు రూ.6000 పెంచేస్తున్నామని వెల్లడించింది.
పెరిగిన ధరల ప్రకారం ఎర్టిగా మోడల్ కారు ధర రూ.8.41 లక్షలు పలుకుతుందని మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. 1.5 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్తోపాటు 6000 ఆర్పీఎం వద్ద 103 పీఎస్, 4400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ కన్వర్టర్తో ఎర్టిగా ఇంజిన్ రూపొందించారు. ఈ కారు పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లీటర్ పెట్రోల్పై 20.51 కి.మీ, లీటర్ సీఎన్జీపై 26.11 కి.మీ మైలేజీ ఇస్తుంది.