న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ పండుగ సీజన్లో దేశీ విమాన ప్రయాణీకులు సంఖ్య బాగా పెరగడంతో విమాన చార్జీలు…కొవిడ్ ముందస్తుస్థాయిని మించిపోయాయి. ఈ చార్జీలు అప్పటికంటే భారీగా 30-100 శాతం మధ్య పెరిగాయని థామస్కుక్ ఇండియా ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగి చెప్పారు. పోర్ట్బ్లయర్ (అండమాన్)కుఅహ్మదాబాద్ నుంచి చార్జీ 100 శాతం పెరగ్గా, ఢిల్లీ నుంచి 50 శాతం, ముంబై, చెన్నై, కొల్కతాల నుంచి అదే నగరానికి చార్జీ 30 చొప్పున అధికమయ్యిందన్నారు. ఢిల్లీ, ముంబై, కొల్కాతాల నుంచి గోవాకు 10-30 శాతం మధ్య చార్జీలు పెరిగాయన్నారు. అయితే నూరు శాతం సామర్థ్యంతో విమానాలు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించినందున, చార్జీలు సాధారణస్థాయికి వస్తాయని అంచనావేస్తున్నట్లు రస్తోగి తెలిపారు.